News February 16, 2025

కర్నూలు, ఆదోనిలో ఎండు మిర్చి ధరల వివరాలు

image

కర్నూలు, ఆదోని వ్యవసాయ మార్కెట్లలో శనివారం ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటా గరిష్ఠ ధర రూ.13,236 పలకగా.. కనిష్ఠ ధర రూ.2,200 పలికింది. కర్నూల్లో కనిష్ఠంగా రూ.3,500 పలకగా.. గరిష్టంగా రూ.12,813 పలికినట్లు ఆయా మార్కెట్ల ఎంపిక శ్రేణి అధికారులు తెలిపారు.

Similar News

News March 28, 2025

విద్యార్థులకు ప్రతి గంటకు వాటర్ బెల్: డీఈవో

image

పత్తికొండ రెవెన్యూ డివిజన్‌లో పాఠశాలల విద్యార్థులకు ప్రతి గంటకు వాటర్ బెల్ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ యాజమాన్యాన్ని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు ఎండవేడిమికి గురికాకుండా శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూడాలని అన్నారు. ప్రతి విద్యార్థి తగినంత మంచినీటిని తాగేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

News March 27, 2025

జడ్పీ కోఆప్షన్ మెంబర్‌గా మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్

image

కర్నూలు జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్‌గా వైసీపీ నేత మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం కర్నూలులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్‌తో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి పీ.రంజిత్ బాషా ప్రమాణ స్వీకారం చేయించారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

News March 27, 2025

కర్నూలు జిల్లాలో ఎంపీపీ స్థానాలు వైసీపీ కైవసం

image

కర్నూలు జిల్లాలో వెల్దుర్తి, తుగ్గలి ఎంపీపీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. రెండు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. వెల్దుర్తి ఎంపీపీగా దేశాయి లక్ష్మిదేవమ్మ, తుగ్గలి ఎంపీపీగా రామాంజినమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ ఉప సర్పంచ్‌గా శాకీరాను వార్డు సభ్యులు ఎన్నుకున్నారు. మరోవైపు జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఎన్నికకు వైసీపీ తరఫున మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.

error: Content is protected !!