News July 11, 2024
కర్నూలు: ఈనెల 14 కోఆపరేటివ్ ఎన్నికలు

ఉమ్మడి కర్నూలు జిల్లా తపాలా కార్యాలయంలో కోఆపరేటివ్ ఎన్నికల కోలాహలం మొదలైంది. అభ్యర్థులు విజయం కోసం ప్రచారం ముమ్మరం చేశారు. జులై 14న కోఆపరేటివ్లో సభ్యులంతా కలిసి ఓటింగ్లో పాల్గొని డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఉమ్మడి జిల్లాలో 746 మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. 9 డైరెక్టర్ల పదవులకు 32 మంది తలపడుతున్నారు. 14న పోలింగ్, సాయంత్రం లెక్కింపు, అదేరోజు రాత్రికి ఫలితాలను ప్రకటిస్తారు.
Similar News
News July 5, 2025
పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయం: మంత్రి

పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం నగరపాలక కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి స్వర్ణాంధ్ర-పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్షిప్) తొలి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ -2047 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, కుటుంబాల అర్హతలు పక్కాగా పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేయలని ఆదేశించారు.
News July 5, 2025
ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం: కలెక్టర్

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో ఈనెల 10న మెగా పీటీఎం 2.0 కార్యక్రమం
నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా శనివారం ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసమే పీటీఎం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
News July 5, 2025
వైసీపీ కర్నూలు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా ఉస్మాన్ సాహెబ్

వైసీపీ కర్నూలు జిల్లా వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా గోనెగండ్లకు చెందిన కార్యకర్త ఉస్మాన్ సాహెబ్ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఉస్మాన్ సాహెబ్ మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్త అయిన తనకు అధిష్ఠానం జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇన్ఛార్జ్ బుట్టా రేణుక, ఎంపీపీ నస్రుద్దీన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.