News March 20, 2025
కర్నూలు: ఈవీఎం వేర్ హౌస్ను పరిశీలించిన కలెక్టర్

త్రైమాసిక తనిఖీలో భాగంగా ఈవీఎంలు భద్రపరచిన వేర్ హౌస్ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు. బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ ఆవరణలోని ఈవిఎం వేర్ హౌస్లో ఈవీఎంలను భద్రపరచిన తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఈవీఎంలను భద్రతపై నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 23, 2025
అదే మా లక్ష్యం: కర్నూలు ఎస్పీ

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. హెల్మెట్ తప్పనిసరి, ఓవర్స్పీడ్–ఓవర్లోడ్ నిషేధం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని ప్రజలకు సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.
News November 23, 2025
నిబద్ధత, సేవ భావంతో సేవలు అందించాలి: కలెక్టర్

ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చే విధంగా నిబద్ధతతో సేవాభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థల శిక్షణ పొందుతున్న 16 మంది యువ ఐపీఎస్, యువ ఐఏఎస్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. పరిపాలనలో మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలన్నారు.
News November 23, 2025
నిబద్ధత, సేవ భావంతో సేవలు అందించాలి: కలెక్టర్

ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చే విధంగా నిబద్ధతతో సేవాభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థల శిక్షణ పొందుతున్న 16 మంది యువ ఐపీఎస్, యువ ఐఏఎస్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. పరిపాలనలో మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలన్నారు.


