News February 6, 2025

కర్నూలు: ఈ దరఖాస్తులకు రేపే చివరి తేది

image

స్వయం ఉపాధిని కల్పించేందుకు ప్రభత్వం కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. ఈ మేరకు బీసీ, ఈబీసీ వర్గాల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అందుకు ఈ నెల 7వ తేదీ వరకు అవకాశం కల్పించింది. లబ్ధిదారులు https://apobmms.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుస్సేన్ తెలిపారు.

Similar News

News December 9, 2025

నిర్మల్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

image

నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్, మామడ, లక్ష్మణచందా మండలాల్లోని 136 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

News December 9, 2025

మంచిర్యాల: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

image

మంచిర్యాల జిల్లా దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట మండలాల్లోని 90 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

News December 9, 2025

కడప జిల్లా SP కీలక సూచన.!

image

భూ వివాదాలు, ఆర్థిక నేరాల విచారణలో న్యాయపరమైన నిబంధనలు పాటించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం ఎస్పీ ప్రొద్దుటూరు పోలీస్ అధికారులకు కేసుల విచారణలో నిర్దేశం చేశారు. క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సంబంధిత అధికారులు, లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.