News July 12, 2024

కర్నూలు: ఉద్యోగ మేళాలో 37 మంది ఎంపిక

image

నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి పేర్కొన్నారు. గురువారం ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. అనంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్ చిట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. మేళాకు 74 మంది హాజరు కాగా.. అందులో 37 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.

Similar News

News December 9, 2025

క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా: మంత్రి

image

జిల్లాలో క్రీడాభివృద్ధితో పాటు క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం టీజీవీ సంస్థలు కృషి చేస్తాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇటీవల దక్షిణ భారత స్థాయి సిలంబం పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను కర్నూలులోని తన నివాసంలో ఆయన మంగళవారం ఘనంగా సత్కరించారు. జిల్లా కార్యదర్శి మహావీర్ మాట్లాడుతూ.. దక్షిణ భారత స్థాయిలో జిల్లా క్రీడాకారులు అనేక పతకాలు సాధించారన్నారు.

News December 9, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. భారీ వాహనాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్‌డివిజన్లలో నేషనల్ హైవేలు 40, 44పై లారీలు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, వ్యాన్లు, లగేజీ వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించారు.

News December 9, 2025

ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం తగ్గించాలి: కర్నూలు కలెక్టర్

image

జిల్లాలో పీజీఆర్ఎస్ పనితీరు విశ్లేషణలో భాగంగా సీఎం కార్యాలయం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం గత నెలలో ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం బాగా తగ్గిందని, డిసెంబర్‌లో ఇంకా ఎక్కువగా తగ్గించాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఫిర్యాదులను ఆడిట్ చేయడంలో 20 శాతం పెండింగ్ ఉందని వెంటనే ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.