News June 20, 2024
కర్నూలు: ఐదుగురు సీఐలకు స్థానచలనం
కర్నూలు జిల్లాలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఆదోని ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ సీఐ తేజోమూర్తి వైఎస్సార్ జిల్లా చిన్న చౌక్ స్టేషన్కు, ప్రొద్దుటూరు ఫ్యాక్షన్ జోన్లోని కంబగిరి రాముడు కర్నూలు సీపీఎస్కు బదిలీ అయ్యారు. చచిన్న చౌక్ పీఎస్ సీఐ భాస్కర్ రెడ్డి, ఖాజీపేట అర్బన్ సీఐ రామాంజనేయులును కర్నూలు రేంజ్ వీఆర్కు పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News October 4, 2024
Way2News వార్తకు స్పందించిన పోలీసులు.. బాలుడు లభ్యం
గోనెగండ్ల పరిధిలోని చిన్నమరివీడుకు చెందిన వర్ధన్ నాయుడు భారతీ దంపతుల కుమారుడు సూర్యతేజ(14) నిన్నటి రోజు ఇంటి నుంచి అదృశ్యమయ్యాడని తల్లి భారతి రోధించిన తీరును Way2News ప్రచురించింది. సీఐ గంగాధర్ స్పందించి ఏఎస్ఐ తిమ్మారెడ్డిని ఆదేశించడంతో.. బాలుని ఆచూకీ కోసం కర్నూలులో గాలించారు. పాత బస్టాండ్లో ఆచూకీ లభించింది. దీంతో Way2Newsకు, పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
News October 4, 2024
ఆలూరు ఎమ్మెల్యే తమ్ముడు సహా 24 మందిపై కేసు
కర్నూలు జిల్లాలోని రెన్యూ విండ్ పవర్, గ్రీన్ ఇన్ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులకు పాల్పడిన ఘటనలో పోలీసులు 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బసినె విరూపాక్షి తమ్ముడు, వైసీపీ నేత బసినె వెంకటేశ్తో పాటు మరో 23 మందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. వారికి సంబంధించిన వాహనాలను సీజ్ చేశారు.
News October 4, 2024
కర్నూలు: లా పరీక్ష ఫలితాల విడుదల
రాయలసీమ వర్సిటీ పరిధిలో జరిగిన (2023) లా మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం వైస్ ఛాన్స్లర్ ఎన్టీకే నాయక్ విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సు మొదటి సెమిస్టర్లో 153 మంది, మూడో సెమిస్టర్లో 1,509 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐదేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్లో 32 మంది, మూడో సెమిస్టర్లో 37 మంది, మూడేళ్ల కోర్సు సప్లమెంటరీ మొదటి సెమిస్టర్లో 38 మంది, మూడో సెమిస్టర్లో 17 మంది ఉత్తీర్ణులయ్యారు.