News May 11, 2024
కర్నూలు: ఓటుకు రూ.5 వేలు?
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చరిత్రలో ఎప్పుడూ లేని ఖరీదైన ఎన్నికలు ఈసారి జరగనున్నాయి. ప్రచార ఘట్టం ముగుస్తుండటంతో డబ్బు పంపిణీపై నేతలు దృష్టి పెట్టారు. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బనగానపల్లెలో ఓ పార్టీ నేతలు రూ.2 వేలు పంపిణీ చేయగా.. మరో రూ.వెయ్యి కూడా పంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ, పత్తికొండ, కర్నూలులో వెయ్యి నుంచి రూ.2 వేలు పంచుతున్నట్లు సమాచారం.
Similar News
News October 1, 2024
పింఛన్ పంపిణీ@2PM: కర్నూలు 96.43%, నంద్యాల 94.26%
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగలా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు జిల్లాలో 96.43%, నంద్యాల జిల్లాలో 94.26% పంపిణీ పూర్తయింది. కర్నూలు జిల్లాలో 2,41,843 మందికి గానూ 2,33,204 మందికి, నంద్యాల జిల్లాలో 2,18,225 మందికి గానూ 2,05,691 మందికి పింఛన్ల సొమ్ము అందింది.
News October 1, 2024
ఒక్కసారైనా రక్తదానం చేశారా?
అక్టోబర్ 1.. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. రక్తదానంపై చైతన్యం కలిగించేందుకు 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. రక్తదానం అన్ని దానాల కంటే ముఖ్యమైనది. ‘రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి’ అన్న నినాదాన్ని తరచూ వింటుంటాం. ఇదే స్ఫూర్తిగా జిల్లాలోని రక్తదాతలు ఆపద వేళ మేమున్నామంటూ ఎంతో మందికి పునర్జన్మనిస్తున్నారు. కొందరు పదుల సార్లు రక్తదానం చేసి అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఒక్కసారైనా రక్తదానం చేశారా?
News October 1, 2024
కర్నూలులో కుక్కల దాడి.. 30 మందికి గాయాలు
కర్నూలులోని వన్టౌన్ పరిధిలో కుక్కలు దాడి చేయడంతో 30 మందికిపైగా చిన్నారులు గాయపడ్డారు. వన్టౌన్ పరిధిలోని బండిమెట్ట, గడ్డా వీధి, చిత్తారి వీధి, గరీబ్ నగర్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి కుక్కలు దాడి చేశాయి. గాయపడిన చిన్నారులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత చిన్నారులను మంత్రి భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరామర్శించారు. గాయపడిన ఒక్కో చిన్నారికి రూ.10వేల పరిహారం అందిస్తామన్నారు.