News April 2, 2024

కర్నూలు: కాంగ్రెస్ MLA అభ్యర్థులు వీరే..

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురు MLA అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఎస్సీ సామాజికవర్గాలైన కోడుమూరు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణ, నందికొట్కూర్ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే తోగూర్ అర్థర్‌ను ప్రకటించింది. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా గోకుల్ కృష్ణారెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పీజీ రాంపుల్లయ్య పోటీ చేయనున్నారు.

Similar News

News November 30, 2025

20 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు: మంత్రి భరత్

image

కర్నూల్ కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వచ్చే నెల 8న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు (18-35 ఏళ్లు) జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 20 కంటే ఎక్కువ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని స్కిల్ అభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతరం జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను శనివారం విడుదల చేశారు.

News November 30, 2025

రూ.105.66 కోట్లతో రోడ్ల నిర్మాణం: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో పాడైన రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రోడ్లు-భవనాల శాఖ ద్వారా రూ.105.66 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. మొత్తం 222.18 కి.మీ పొడవుతో 30 రోడ్ల పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఢనాపురం-హొళగుంద రోడ్‌కు రూ.13.70 కోట్లు, బైచిగేరి-పెద్దకడుబూరు రోడ్‌కు రూ.6.40 కోట్లు, ఎమ్మిగనూరు-మాలపల్లి-కోసిగి రోడ్‌కు రూ.7.40 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.

News November 30, 2025

రూ.105.66 కోట్లతో రోడ్ల నిర్మాణం: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో పాడైన రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం రోడ్లు-భవనాల శాఖ ద్వారా రూ.105.66 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. మొత్తం 222.18 కి.మీ పొడవుతో 30 రోడ్ల పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఢనాపురం-హొళగుంద రోడ్‌కు రూ.13.70 కోట్లు, బైచిగేరి-పెద్దకడుబూరు రోడ్‌కు రూ.6.40 కోట్లు, ఎమ్మిగనూరు-మాలపల్లి-కోసిగి రోడ్‌కు రూ.7.40 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.