News December 16, 2024
కర్నూలు: ‘గ్రివెన్స్ డేకు 93 ఫిర్యాదులు’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734348462657_17262129-normal-WIFI.webp)
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 93 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు.
Similar News
News January 23, 2025
నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వృద్ధుడు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737613851553_20488778-normal-WIFI.webp)
నంద్యాల రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు నంద్యాల రైల్వే ఎస్సై అబ్దుల్ జలీల్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఫ్లాట్ఫామ్ నంబర్2 వద్ద వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు కాషాయపు వస్త్రాలు ధరించాడని, సుమారు 60 ఏళ్లు ఉంటాయన్నారు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆచూకీ తెలిస్తే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
News January 23, 2025
12వ రోజు 286 మంది అభ్యర్థుల ఎంపిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737554512436_18521686-normal-WIFI.webp)
ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో 12వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. 600 మంది అభ్యర్థులకు గాను 415 మంది అభ్యర్థులు హజరయ్యారన్నారు. ఫైనల్ పరీక్షకు 286 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఎస్పీ తెలిపారు.
News January 23, 2025
జాతీయ స్థాయి బీచ్ హ్యాండ్ బాల్ పోటీలకు ఆత్మకూరు క్రీడాకారులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737555091123_50299483-normal-WIFI.webp)
భారత ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి 31 వరకు ఉత్తరాఖండ్లో జరగబోయే 38వ జాతీయ క్రీడలలో ఆంధ్రప్రదేశ్ బీచ్ హ్యాండ్ బాల్ పోటీలకు ఆత్మకూరుకు చెందిన క్రీడాకారులు శివకుమార్, రియాజ్ ఎంపికయ్యారు. ఈ మేరకు జిల్లా సంఘం కార్యదర్శి రుద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను టీ&టీ అధినేత జబీర్ హుస్సేన్ ప్రత్యేకంగా అభినందించి నగదు ప్రోత్సాహాన్ని అందించారు.