News June 12, 2024
కర్నూలు: చంద్రబాబు సమీక్షలో జిల్లా మంత్రులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూఖ్, టీజీ భరత్ పాల్గొన్నారు. కాగా రేపటిలోగా నూతన మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ వరిస్తుందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News November 27, 2025
ఎలక్టర్ల మ్యాపింగ్లో పురోగతి ఉండాలి: కర్నూల్ కలెక్టర్

ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియలో మరింత పురోగతి తీసుకురావాలని కర్నూల్ జిల్లా కలెక్టర్ సిరినీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ సూచించారు. గురువారం విజయవాడలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫార్ములను త్వరితగతిన క్లియర్ చేయాలని, బీఎల్ఓ, ఎపిక్ కార్డు పంపిణీ, మ్యాపింగ్, శిక్షణ విషయాలను వేగవంతంచేయాలని సూచించారు.
News November 27, 2025
విద్యార్థులతో కర్నూలు కలెక్టర్ మాటామంతి

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి బుధవారం కార్యాలయ ఛాంబర్లో మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం రక్షణపై పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల అవగాహనను పరిశీలించారు. విద్యార్థుల పాఠశాల సమస్యలు, పాఠ్యాంశాల బోధన, 10వ తరగతి పరీక్షలకు సిద్ధత వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు. ధైర్యంగా సమాధానాలిచ్చిన విద్యార్థులను అభినందించారు.
News November 26, 2025
కలెక్టర్ను మైమరిపించిన ఓర్వకల్లు మహిళా రైతు

ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు రాజకుమారిని కలెక్టర్ డా. ఏ. సిరి ప్రశంసించారు. బుధవారం రాజకుమారి పొలంను కలెక్టర్ పరిశీలించి పంటల సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 70 సెంట్ల భూమిలో అంతర పంటల పద్ధతిలో కందులు, అలసందలు, సజ్జలు, మినుములు, గోరు చిక్కుడు, ఆకుకూరలు సాగు చేసి రూ.5 వేల పెట్టుబడితో రూ.60 వేల లాభం సాధించినట్లు రాజకుమారి వివరించారు.


