News April 22, 2025
కర్నూలు జిల్లాలో ఆశాజనకంగా పత్తి ధరలు.!

కర్నూలు జిల్లాలో వారం రోజుల్లో పత్తి ధరలు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో దూది గింజల ధర స్వల్పంగా పెరగడం, పత్తి జిన్నింగ్ ప్రెస్సింగ్ పరిశ్రమల ఉత్పత్తికి అవసరమైన పత్తి మార్కెట్కి రాకపోవడంతో ధరలు పెరిగాయి. ఆదోని మార్కెట్లో సోమవారం పత్తి క్వింటాల్ ధర గరిష్ఠంగా రూ.8,179 గా ఉంది. గత వారంతో పోలీస్తే రూ.200లకు పెరిగింది. కనిష్ఠ ధర రూ.4,509 ఉండగా సగటు ధర రూ.7,589కి పలికింది.
Similar News
News April 22, 2025
కర్నూలు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

➤పత్తికొండ యువతికి 990 మార్కులు➤ విషాదం.. తండ్రీకూతురి ప్రాణం తీసిన లారీ➤ రేపే పదో తరగతి రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల ఎదురుచూపు➤ కర్నూలు: ఆర్టీసీ బస్సులో పొగలు ➤ కర్నూలు జిల్లాలో ఆశాజనకంగా పత్తి ధరలు➤ కర్నూలు జిల్లా ఎస్పీ హెచ్చరికలు➤ ఉపాధి పనులపై కర్నూలు కలెక్టర్ కీలక ఆదేశాలు➤ గూడూరులో ఇద్దరు కార్మికుల మృతి➤ డిప్యూటీ డీఈవోగా ఐజీ రాజేంద్రప్రసాద్ బాధ్యతలు
News April 22, 2025
పత్తికొండ యువతికి 990 మార్కులు

పత్తికొండ పట్టణంలోని అరుంధతి నగర్కు చెందిన వడ్డే రాజగోపాల్, అనిత దంపతుల కుమార్తె నేహ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు కాలేజ్లో చదివిన యువతి బైపీసీలో 990/1000 మార్కులు సాధించారు. దీంతో అధ్యాపకులు, తల్లిదండ్రులు, స్నేహితులు యువతిని అభినందించారు.
News April 22, 2025
తండ్రీకూతురి ప్రాణం తీసిన లారీ

ఆలూరు మండలం పెద్దహోతూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో తండ్రీకూతురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మృతులు ముత్తుకూరు చెందిన వడ్డే ఈరన్న, శ్రావణిగా గుర్తించారు. బాలిక చిప్పగిరి KGBV పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో కుమార్తెను తండ్రి బైక్పై ఇంటికి తీసుకెళ్తుండగా లారీ ఢీకొని దుర్మరణం చెందారు. పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.