News December 19, 2024
కర్నూలు జిల్లాలో 16 మంది డిబార్
కర్నూలు జిల్లాలో 16 మంది డిగ్రీ విద్యార్థులు డిబార్ అయ్యారు. మాస్ కాపీయింగ్కు పాల్పడటంతో డిబార్ చేసినట్లు ఇన్ఛార్జి వీసీ ఎన్టీకే నాయక్ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన మొదటి సెమిస్టర్ పరీక్షకు 10,504 మందికి గానూ 9,125 మంది, ఐదో సెమిస్టర్ పరీక్షకు 62 మందికి గానూ 48 మంది హాజరయ్యారు.
Similar News
News January 19, 2025
తిక్కారెడ్డి సంచలన కామెంట్స్
టీడీపీ ఎమ్మెల్యేలు పదవులు అమ్ముకుంటున్నారంటూ కర్నూలు <<15188222>>జిల్లా <<>>టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయావర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు రూ.5లక్షలకు డీలర్షిప్లు, నామినేటెడ్ పోస్టులను అమ్ముకుంటున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వీరి అవినీతి వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై మీరేమంటారు.. కామెంట్ చేయండి.
News January 19, 2025
9వ రోజు 246 మంది అభ్యర్థుల ఎంపిక
ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలులోని ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో 9వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. 600 మంది అభ్యర్థులకు గాను 338 మంది అభ్యర్థులు బయోమెట్రిక్కు హజరయ్యారన్నారు. ఫైనల్ పరీక్షకు 246 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఎస్పీ తెలిపారు.
News January 19, 2025
హత్య కేసులో ఏడుగురు అరెస్ట్: డీఎస్పీ
చిప్పగిరి మండలం బంటనహాల్ గ్రామంలో ఖాజీపురం రామాంజనేయులు హత్య కేసులో ప్రధాన నిందితులు తలారి సురేశ్, కృష్ణమూర్తితో పాటు మరో ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వెంకటరామయ్య తెలిపారు. ఆలూరు సీఐ వెంకట చలపతి, ఎస్ఐ సతీశ్ కుమార్తో కలిసి మీడియా ముందు వివరాలు వెల్లడించారు. ముద్దాయిలను కోర్టులో హాజరు పరిచి, రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.