News April 25, 2024
కర్నూలు జిల్లాలో 180 నామినేషన్లు దాఖలు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లాలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రోజు నుంచి నేటి వరకు జిల్లాలోని పార్లమెంట్తో పాటు 8 నియోజకవర్గాలకు 180 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తెలిపారు. పాణ్యం, కర్నూలు, కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించి 161 మంది అభ్యర్థులు 180 నామినేషన్ పత్రాలను అందజేశారన్నారు.
Similar News
News January 22, 2026
నంద్యాల: Night view అదరహో!

శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం రాత్రి వేళ విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. బుధవారం రాత్రి చిత్రీకరించిన రమణీయ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుండటంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఈ అద్భుతమైన రాత్రి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఓం నమఃశివాయ!
News January 22, 2026
పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాల అమలుపై సమీక్ష

పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ పథకాలతో పాటు పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం అమలు తీరుపై సమీక్షించారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సరి ఈ సమావేశంలో పాల్గొని, జిల్లాలో పథకాల పురోగతిని వివరించారు.
News January 22, 2026
పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాల అమలుపై సమీక్ష

పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ పథకాలతో పాటు పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం అమలు తీరుపై సమీక్షించారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సరి ఈ సమావేశంలో పాల్గొని, జిల్లాలో పథకాల పురోగతిని వివరించారు.


