News February 23, 2025
కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో 9,993 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
Similar News
News February 24, 2025
తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తా: సమంత

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాయిపల్లవి, నజ్రియా, అలియా భట్ వంటి హీరోయిన్లు రాక్ స్టార్లు అని హీరోయిన్ సమంత చెప్పారు. ఇన్స్టాలో అభిమానుల ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. నెగటివ్ ఆలోచనలను అధిగమించేందుకు రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తానని తెలిపారు. తెలుగులో సినిమాలు చేయాలని ఓ టాలీవుడ్ ఫ్యాన్స్ కోరగా తప్పకుండా మళ్లీ వస్తానని బదులిచ్చారు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చూసినట్లు పేర్కొన్నారు.
News February 24, 2025
జగిత్యాల జిల్లాలో నేటి TOP NEWS!

@ జిల్లా వ్యాప్తంగా జోరుగా MLC ప్రచారం @ శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఆలయాలు @ మెట్పల్లిలో పర్యటించిన మాజీ గవర్నర్ చిన్నమనేని విద్యాసాగర్ రావు @ రాజారాంపల్లిలో 12 ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు @ విత్తనాలు నాటిన వెల్గటూరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు @ ఉమ్మడి మేడిపల్లి పట్టభద్రులతో ప్రభుత్వ విప్ ఆది సమావేశం @ ఇండిపెండెంట్ MLC అభ్యర్థికి రోడ్డు ప్రమాదంలో గాయాలు.. పరామర్శించిన మల్యాల ట్రస్మా సభ్యులు.
News February 24, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో TODAY TOP NEWS

➤ గ్రామాల వారీగా పాదయాత్ర: తోపుదుర్తి
➤ ధర్మవరం రైల్వే స్టేషన్లో తనిఖీలు
➤ చిల్లవారిపల్లి గ్రామస్థులకు డీఎస్పీ హెచ్చరిక
➤ డీహైడ్రేషన్తో లేపాక్షి యువకుడి మృతి
➤ పరిగి మండలంలో వైసీపీకి షాక్
➤ సత్యసాయి: HNSS ఫేస్-2 కాలువ మ్యాప్ పరిశీలన
➤ చెన్నేకొత్తపల్లిలో విషాదం.. చిన్నారి మృతి
➤ అనంతపురం: 6,463 మంది పరీక్షలు రాశారు
➤ బత్తలపల్లి: తంబాపురంలో అగ్ని ప్రమాదం