News February 23, 2025
కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో 9,993 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
Similar News
News March 15, 2025
కర్నూలులో హత్య.. పాత కక్షలే కారణమా?

కర్నూలులో TDP నేత సంజన్న <<15763975>>హత్య<<>> కలకలం రేపింది. శరీన్నగర్లో ఉంటున్న సంజన్నకు స్థానికంగా అంజితో ఆధిపత్యపోరు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్తున్న సంజన్నపై దండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న సంజన్న వర్గీయులు ఆంజి వాహనంపై దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. అంజి వర్గీయులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 15, 2025
కర్నూలులో టీడీపీ నాయకుడి దారుణ హత్య

కర్నూలులో దారుణ హత్య జరిగింది. నగరంలోని షరీఫ్ నగర్కు చెందిన కార్పొరేటర్ జయన్న తండ్రి సంజన్నను గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి హత్య చేశారు. 2024లో టీడీపీలో చేరిన ఆయన బైరెర్డి వర్గీయుడిగా ఉన్నారు. అయితే స్థానికంగా అంజన్నతో మృతుడికి ఆధిపత్యపోరు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 14, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ 172 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు
➤ కర్నూలు జిల్లా వాసికి ఆల్ ఇండియా 199వ ర్యాంకు
➤ నంద్యాల: వైసీపీ నేతపై హత్యాయత్నం.. 9మంది టీడీపీ నేతలపై కేసు
➤ స్త్రీల వేషంలో పురుషులు.. రతీ మన్మథులకు పూజలు
➤ మంత్రాలయంలో కన్నడ సీరియల్ షూటింగ్
➤ ఆదోని: ఇన్ స్టాగ్రామ్ లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి
➤ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన పెద్దకడబురు విద్యార్థులు
➤వైఎస్ జగన్ పై సోమిశెట్టి తీవ్ర విమర్శలు