News November 14, 2024

కర్నూలు జిల్లాలో TODAY TOP NEWS

image

* బైరెడ్డిపై హత్య కేసు కొట్టివేత
* ఇసుక డిపోల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం: నంద్యాల కలెక్టర్
* సైబర్ నేరాల పట్ల అప్రమత్తం: కర్నూలు ఎస్పీ
* ఓంకార పుణ్యక్షేత్రంలో ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
* గవర్నర్‌ను కలిసిన మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
* మంత్రాలయంలో ఈ నెల 15న పుణ్యనది హారతి
* ఆదోని: YCP సోషల్ మీడియా కార్యకర్తలపై కేసు
* ఆళ్లగడ్డలో బైక్‌ల చోరీ దొంగ అరెస్ట్

Similar News

News March 9, 2026

కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 157 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 157 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 12,967 మంది విద్యార్థులకు గానూ 12,810 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు. నిబంధనల మేరకు అన్ని కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు.

News March 9, 2026

కర్నూలు: నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ ఈనెల 9న ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమస్త ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ తెలిపారు. చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు అని తెలిపారు.

News March 9, 2026

లోన్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

అనుమానాస్పద లోన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను కోరారు. తక్కువ సమయంలోనే లోన్లు ఇస్తామని సోషల్ మీడియా, మెసేజ్‌ల ద్వారా వచ్చే ప్రలోభాలకు గురికావద్దని హెచ్చరించారు. లోన్ అవసరమైతే కేవలం గుర్తింపు పొందిన బ్యాంకులు మాత్రమే సంప్రదించాలన్నారు. ఎవరైనా యాప్‌ల ద్వారా వేధింపులకు లేదా బెదిరింపులకు పాల్పడితే వెంటనే 1930 నంబర్‌కు లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.