News January 20, 2025
కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్

కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ బదిలీ అయ్యారు. నూతన ఎస్పీగా 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. బిందుమాధవ్ కాకినాడ ఎస్పీగా నియమితులయ్యారు.
Similar News
News November 24, 2025
అర్జీలు స్వీకరించిన కర్నూలు కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ. సిరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.
News November 24, 2025
అర్జీలు స్వీకరించిన కర్నూలు కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఏ. సిరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.
News November 24, 2025
సైబర్ మోసాలపై అప్రమత్తం కావాలి: కర్నూలు ఎస్పీ

ATM డిపాజిట్ మెషిన్లు (CDM), PhonePe/UPIను ఉపయోగించి మోసగాళ్లు అక్రమ లావాదేవీలు జరిపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ‘తెలియని వ్యక్తుల కోసం ATM CDMలో డబ్బు జమ చేయండి, PhonePe/UPI ద్వారా పంపండి, కమిషన్ ఇస్తాం’ అంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లు చెప్పారు. ఇవి మనీ లాండరింగ్ & సైబర్ నేరాల కిందికి వస్తాయన్నారు. వాటిలో పాల్గొనేవారు కూడా నేరస్థులే అన్నారు.


