News February 1, 2025
కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ బాధ్యతల స్వీకరణ

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలుంటే తమకు తెలపాలని, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.
Similar News
News February 13, 2025
కర్నూలు జిల్లాకు ‘దామోదరం’ పేరు పెట్టాలి: వీహెచ్

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీకి రెండో సీఎంగా ఆయన సేవలు అందించారని, తొలి దళిత ముఖ్యమంత్రి కూడా ఆయనే అని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి జిల్లాకు దామోదరం పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. కాగా సంజీవయ్య జిల్లాలోని కల్లూరు మండలం పెద్దపాడులో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు 1921లో జన్మించిన విషయం తెలిసిందే.
News February 13, 2025
‘భీముని కొలను’ గురించి తెలుసా?

పూర్వం పాండవులు శ్రీశైలం నల్లమల అడవుల్లో తీర్థయాత్రలు చేస్తుండగా ద్రౌపది దాహం తీర్చుకున్న కొలనే భీముని కొలనుగా ప్రసిద్ధి చెందింది. ద్రౌపది దాహంగా ఉందని చెప్పడంతో భీముడు చుట్టుపక్కల వెతికారని చరిత్ర చెబుతోంది. దాలోమశ మహర్షి ఒక శిలను చూపించి, పగులగొట్టమని చెప్పడంతో గదతో ఆ శిలను భీముడు పగులగొట్టగా నీటి ధారలు దూకాయట. భీముని కారణంగా ఏర్పడిన కొలను కావడంతో ‘భీముని కొలను‘ అనే పేరు వచ్చిందని అంటారు.
News February 13, 2025
కర్నూలు జిల్లాలో ఉరేసుకుని వివాహిత మృతి

కర్నూలు జిల్లా పెద్ద తుంబలం గ్రామంలో విషాద ఘటన జరిగింది. 21ఏళ్ల వివాహిత అనూష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అనూష, శాంతరాజును ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా విషాదం నింపింది. అనూష మృతికి కుటుంబ ఆర్థిక సమస్యలు కారణమా? గృహ కలహాలా? లేక మరేదైనా కారణమా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.