News April 4, 2025
కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సెల్ఫీ

కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా నేతలను ఆప్యాయంగా పలకరించారు. వారి కోరిక మేరకు సెల్ఫీ తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జి బుట్టా రేణుక నెట్టింట పోస్ట్ చేశారు. ‘జగనన్నతో స్నేహపూర్వక సమావేశం. ఆప్యాయంగా సెల్ఫీ తీసుకున్నారు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 3, 2026
HNK: లారీ ఢీకొని గీత కార్మికుడి దుర్మరణం

ములుగు రోడ్డులోని కొత్తపేట ఎన్ఎస్ఆర్ ఆసుపత్రి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరెపల్లికి చెందిన గీత కార్మికుడు గౌని అనిల్కుమార్ గౌడ్(48) మృతి చెందారు. బైక్పై వెళ్తున్న ఆయన్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆరెపల్లి రింగ్ రోడ్డు వద్ద సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News January 3, 2026
KCR ఎందుకలా చేశారో సభకు వస్తే అడుగుదామనుకున్నా: రేవంత్

TG: కృష్ణా ప్రాజెక్టులపై రాష్ట్రానికి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఆయన ఎందుకలా చేశారో సభకు వస్తే అడుగుదామనుకున్నా. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా చేశారా? ఎవరైనా తప్పుదోవ పట్టించారా?’ అని ప్రశ్నించారు. ఇక కర్ణాటక నుంచీ జలవివాదాలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీలు ఉన్నప్పటికీ కర్ణాటకపై కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
News January 3, 2026
GNT: మారిషస్ అధ్యక్షుడికి స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ

మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్కి గుంటూరులో ఘన స్వాగతం లభించింది. సతీ సమేతంగా విచ్చేసిన ఆయనను గుంటూరు వెల్కమ్ హోటల్ వద్ద కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా స్వాగతం పలికారు. 4వ తేదీ ఉదయం 10.30 ని.లకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొంటారు.


