News April 4, 2025

కర్నూలు జిల్లా నేతలతో వైఎస్ జగన్ సెల్ఫీ

image

కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్‌ కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా నేతలను ఆప్యాయంగా పలకరించారు. వారి కోరిక మేరకు సెల్ఫీ తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ఛార్జి బుట్టా రేణుక నెట్టింట పోస్ట్ చేశారు. ‘జగనన్నతో స్నేహపూర్వక సమావేశం. ఆప్యాయంగా సెల్ఫీ తీసుకున్నారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 13, 2025

IIBFలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్& ఫైనాన్స్‌(IIBF)లో 17 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్‌మెంట్/IT/CS/కంప్యూటర్ అప్లికేషన్), డిప్లొమా(IIBF), M.Com/MA/MBA/CA/CMA/CFA, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iibf.org.in

News December 13, 2025

(PMAY-G)-NTR స్కీమ్.. రేపటి వరకే ఛాన్స్

image

AP: PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువు రేపటితో(డిసెంబర్ 14) ముగియనుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం ₹2.50లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం అందజేస్తారు.

News December 13, 2025

చంద్రబాబుపై ఫైబర్‌నెట్ కేసు కొట్టివేత

image

AP: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట కలిగింది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్‌నెట్ కేసును ACB కోర్టు కొట్టేసింది. ఇతర నిందితులకూ క్లీన్‌చిట్ ఇచ్చింది. 2014-19 మధ్య ఫైబర్‌నెట్‌లో ₹114Cr స్కామ్ జరిగిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా CID అధికారులు ఆ కేసు దర్యాప్తును ముగించినట్లు కోర్టుకు తెలిపారు. కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని నాటి, నేటి ఫైబర్‌నెట్ MDలు చెప్పారు. దీంతో కోర్టు తీర్పు వెలువరించింది.