News February 10, 2025
కర్నూలు జిల్లా న్యూస్ రౌండప్

☞ నేడు కర్నూలులో ప్రజా పరిష్కార వేదిక
☞ గీత కులాల మద్యం షాపులకు నేడు లాటరీ
☞ 6,42,391 మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
☞ జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 659 మందిపై కేసులు
☞ రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన 23ఏళ్ల యువకుడి మృతి
☞ శ్రీరంగాపురంలో నేడు ఆరాధన
☞ చెట్నిహళ్లిలో మళ్లీ వివాదం.. అంత్యక్రియల అడ్డగింత
☞ నేడు శ్రీశైలానికి ఐదుగురు మంత్రుల బృందం
Similar News
News March 27, 2025
కర్నూలు జిల్లాలో ఎంపీపీ స్థానాలు వైసీపీ కైవసం

కర్నూలు జిల్లాలో వెల్దుర్తి, తుగ్గలి ఎంపీపీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. రెండు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. వెల్దుర్తి ఎంపీపీగా దేశాయి లక్ష్మిదేవమ్మ, తుగ్గలి ఎంపీపీగా రామాంజినమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ ఉప సర్పంచ్గా శాకీరాను వార్డు సభ్యులు ఎన్నుకున్నారు. మరోవైపు జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఎన్నికకు వైసీపీ తరఫున మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
News March 27, 2025
ఫోన్ చూడొద్దన్నందుకు కర్నూలులో యువకుడి ఆత్మహత్య

తల్లిదండ్రుల మందలించారని యువకుడు ఆత్మహత్యకు చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. చౌడేశ్వరి వీధిలో నివాసం ఉంటున్న కృష్ణమోహన్, వసంత దంపతుల కుమారుడు యశ్వంత్ (21) వడ్రంగి పని చేస్తున్నారు. కొన్ని రోజులుగా పనికి వెళ్లకుండా ఫోన్ చూస్తుండంతో వారు మందలించారు. మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 27, 2025
బైరెడ్డికి పదవి.. వైసీపీ శ్రేణుల హర్షం

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వైఎస్ జగన్ కీలక పదవి ఇవ్వడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడంతో సిద్ధార్థ్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ‘నాపై నమ్మకంతో మరో బాధ్యత ఇచ్చిన జగన్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ బైరెడ్డి ట్వీట్ చేశారు.