News March 30, 2025
కర్నూలు జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి

మార్చి 31న రంజాన్ పండుగ ను పురస్కరించుకొని సోమవారం పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమంను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 10, 2025
ఢిల్లీలో పేలుడు.. అప్రమత్తమైన కర్నూలు పోలీసులు

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు నేపథ్యంలో కర్నూల్ వ్యాప్తంగా అప్రమత్తతా చర్యలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. కర్నూలు, గుత్తి పరిధిలోని పెట్రోల్ బంకులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ గేట్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించారు.
News November 10, 2025
కర్నూలు జిల్లాకు పతకాలు

ఈనెల 7 నుంచి 9 వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్ 19, 14 విభాగాలలో రైఫిల్ షూటింగ్ పోటీలలో జిల్లా క్రీడాకారులు పతకాల పంట సాధించినట్లు జిల్లా కార్యదర్శి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ విజేతలుగా నిలిచిన రామ్ జిగ్నేష్, నక్షత్ర, అన్నా జెన్ క్రీడాకారులను సత్కరించారు. జాతీయ స్థాయిలో సత్తా చాటాలన్నారు.
News November 10, 2025
టైక్వాండో పోటీల్లో కర్నూలు విద్యార్థుల విజయం

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ టైక్వాండో పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ డా. ఏ. సిరి అభినందించారు. కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన అండర్–19 విభాగంలో సుగందిని వెండి, ఇంద్రాణి కాంస్య పతకాలు గెలిచారు. ఏలూరులో జరిగిన అండర్–17 విభాగంలో లేఖ్యశ్రీ చందన వెండి, నక్షత్ర, రేవంత్ కాంస్య పతకాలు సాధించారు. క్రీడాకారులను ప్రోత్సహించిన కోచ్ షబ్బీర్ హుస్సేన్ను కలెక్టర్ అభినందించారు.


