News May 24, 2024

కర్నూలు జిల్లా విద్యా శాఖలో 44 మంది సస్పెండ్

image

ఎన్నికల విధులకు హాజరుకాని 40 మంది ఉపాధ్యాయులను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ సస్పెండ్ చేశారు. వీరితో పాటు మరో నలుగురు ప్రధానోపాధ్యాయులను కడప ఆర్జేడీ సస్పెండ్ చేశారు. అయితే 79 మందిలో 44 మంది సస్పెండ్ కాగా.. మరో 23 మంది ఇచ్చిన సంజాయిషీలను సంబంధిత రిటర్నింగ్ అధికారుల వద్దకు పరిశీలనకు పంపామని వారు పేర్కొన్నారు.

Similar News

News November 19, 2025

అన్నదాతకు ప్రభుత్వం అండ: కలెక్టర్

image

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ 2025-26 2వ విడత కింద జిల్లాలో 2,72,757 మంది రైతులకు రూ.181.51 కోట్లు జమయ్యాయని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. కోడుమూరు ఆర్.కొంతలపాడులో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఉల్లి, మిర్చి, పత్తి పంటల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 11 పత్తి మిల్లులు పనిచేస్తున్నాయన్నారు.

News November 19, 2025

డిజిటల్‌ అరెస్ట్‌ అంటేనే మోసం: ఎస్పీ

image

డిజిటల్‌ అరెస్ట్‌ అంటేనే మోసం అని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు పోలీసులు/సీబీఐ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేసి భయపెట్టడం, వివరాలు తీసుకుని డబ్బులు దోచుకోవడం వంటి కేసులు పెరుగుతున్నాయన్నారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్‌ చేయరని, ఫోన్‌లో డబ్బులు అడగరని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కి లేదా Kurnool Cyber Policeను సంప్రదించాలన్నారు.

News November 19, 2025

డిజిటల్‌ అరెస్ట్‌ అంటేనే మోసం: ఎస్పీ

image

డిజిటల్‌ అరెస్ట్‌ అంటేనే మోసం అని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు పోలీసులు/సీబీఐ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేసి భయపెట్టడం, వివరాలు తీసుకుని డబ్బులు దోచుకోవడం వంటి కేసులు పెరుగుతున్నాయన్నారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్‌ చేయరని, ఫోన్‌లో డబ్బులు అడగరని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కి లేదా Kurnool Cyber Policeను సంప్రదించాలన్నారు.