News September 5, 2024
కర్నూలు జిల్లా YCP అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డి

కర్నూలు జిల్లా వైసీపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీ అధిష్ఠానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలిగా కార్పొరేటర్ నారాయణమ్మ కొనసాగారు. కాగా, 2014 నుంచి 2019 వరకు ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశారు.
Similar News
News November 17, 2025
కర్నూలు: రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్

సత్ప్రవర్తనతో జీవించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. నేరాల్లో మళ్లీ పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
News November 17, 2025
నేడు కర్నూలులో PGRS

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని ఈ నెల 17న (సోమవారం) నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలోని సునయన ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిలోనూ ఈ వేదిక జరుగుతుందని, ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News November 17, 2025
కర్నూలు: రౌడీ షీటర్లకు ఎస్పీ కౌన్సెలింగ్

సత్ప్రవర్తనతో జీవించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నేర నియంత్రణలో భాగంగా జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు పోలీసులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. నేరాల్లో మళ్లీ పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.


