News April 25, 2024

కర్నూలు టీడీపీ అభ్యర్థి ఆస్తి విలువ రూ.278.27 కోట్లు

image

కర్నూలు టీడీపీ అభ్యర్థిగా టీజీ భరత్ మంగళవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. టీజీ భరత్ మెుత్తం ఆస్తుల విలువ రూ.278.27 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరస్తుల విలువ రూ.83.08కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.195.19 కోట్లుగా పేర్కొన్నారు. అప్పులు రూ.19.38 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.

Similar News

News January 24, 2025

వినతులను త్వరితగతిన పరిష్కరించాలి: ఆదోని సబ్ కలెక్టర్

image

గోనెగండ్ల గ్రామంలోని మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భూ సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో తహశీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు.

News January 24, 2025

నంద్యాల: కారు కొంటామని ఎత్తుకెళ్లారు

image

నంద్యాల ఆటోనగర్‌లో కారు విక్రయించడానికి వచ్చిన ఇరువురు వ్యక్తులను కారు కొంటాని నమ్మించి కారు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం తెలంగాణ నారాయణపేటకు చెందిన వెంకటేష్ రెడ్డి కారు నంద్యాలలో విక్రయించి రావాలని దళారి రాఘవేంద్ర, హనుమంతుకు అప్పగించారు. వారు NDL ఆటోనగర్‌కు రాగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం వెంకటేష్ రెడ్డి తాలూకా స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

News January 24, 2025

నంద్యాల జిల్లా కలెక్టర్‌కు అవార్డు

image

నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు వరించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆమెకు అవార్డును బహూకరించనున్నారు.