News October 6, 2024

కర్నూలు: టెట్ పరీక్షకు 256 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలో ఆదివారం టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ వెల్లడించారు. పరీక్షకు మొత్తం 2,435 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 256 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. టెట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినట్లు తెలిపారు.

Similar News

News November 17, 2025

సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రి టీజీ

image

పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలులోని జగన్నాథగుట్ట ఎన్టీఆర్ కాలనీలో సోమవారం 187 టిడ్కో గృహాలను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కర్నూలులో 10 వేల టిడ్కో ఇళ్ల పూర్తికి రూ.18 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తొలి దశలో 187 గృహాలు అందించగా, మార్చి 31 నాటికి మొత్తం ఇళ్ల పనులు పూర్తిచేస్తామని ప్రకటించారు.

News November 17, 2025

సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రి టీజీ

image

పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలులోని జగన్నాథగుట్ట ఎన్టీఆర్ కాలనీలో సోమవారం 187 టిడ్కో గృహాలను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కర్నూలులో 10 వేల టిడ్కో ఇళ్ల పూర్తికి రూ.18 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. తొలి దశలో 187 గృహాలు అందించగా, మార్చి 31 నాటికి మొత్తం ఇళ్ల పనులు పూర్తిచేస్తామని ప్రకటించారు.

News November 17, 2025

రీ-ఓపెన్ అర్జీదారులతో కలెక్టర్ సంభాషణ

image

ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి వచ్చిన రీ-ఓపెన్ అర్జీలపై కర్నూలు కలెక్టర్ డా. ఎ. సిరి సోమవారం స్వయంగా అర్జీదారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. అర్జీల పరిశీలన, ఎండార్స్‌మెంట్ల అందజేత, భూమి సంబంధించిన అంశాలలో ఫీల్డ్ విజిట్ జరిగిందా అనే విషయాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదు పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.