News April 1, 2025
కర్నూలు: టెన్త్ పరీక్షలకు 430 మంది గైర్హాజరు- డీఈఓ

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో మంగళవారం 430 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారైనట్లు డీఈఓ శామ్యూల్ పాల్ తెలిపారు. రెగ్యులర్ విధానంలో 293 మంది ఉండగా, ప్రైవేట్ విధానంలో 137 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 31,990 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోలేదన్నారు.
Similar News
News November 22, 2025
రైతులకు సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్

రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. రైతులు పండించే పంటలకు మార్కెటింగ్ చేసే విధంగా కలెక్టర్ ట్రేడర్లతో శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ, సాగు చేసిన పంటలకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News November 22, 2025
వెయిట్ లిఫ్టర్లను అభినందించిన కలెక్టర్

ఈ నెల 14 నుంచి 16 వరకు విజయనగరం జిల్లాలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, సీనియర్ ఉమెన్, మెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కర్నూలు లిఫ్టర్లు పతకాలు సాధించారు. వెయిట్ లిఫ్టర్లు వీరేశ్, ముషరాఫ్, పర్వేజ్, చాంద్ బాషా, హజరత్ వలిని కలెక్టర్ డా.సిరి శనివారం అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయి వెయిట్ పోటీల్లోనూ ఇదే ప్రతిభ కనబరచాలన్నారు. కోచ్ యూసుఫ్ పాల్గొన్నారు.
News November 22, 2025
ఏపీ కుర్ని కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్గా ఎమ్మిగనూరు నేత

కూటమి ప్రభుత్వం మరో 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మిగనూరుకు చెందిన టీడీపీ నేత మిన్నప్పకు కుర్ని కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. మిన్నప్ప మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆశీర్వాదంతో తనకు ఈ పదవి దక్కిందన్నారు. బీవీకి, సీఎం చంద్రబాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


