News October 15, 2024
కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. క్యాబినెట్లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. కర్నూలు జిల్లాకు నిమ్మల రామానాయుడు, నంద్యాలకు పయ్యావుల కేశవ్ ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును వీరు పర్యవేక్షిస్తారు.
Similar News
News November 26, 2025
కర్నూలు జిల్లా నుంచి అధ్యక్షా.. అనేది వీరే..!

సంవిధాన్ దివస్-రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని (మాక్ అసెంబ్లీ) కల్పించారు. బుధవారం కర్నూలు జిల్లా నుంచి అసెంబ్లీలో మాట్లాడేందుకు జిల్లా ఎమ్మెల్యేలు (విద్యార్థులు) సిద్ధమయ్యారు. దయాన, లోకేశ్వర్ రెడ్డి, గాయత్రి, నవనీత్ కుమార్, వీరేంద్ర, గౌతమి, ప్రవీణ్ ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించనున్నారు.
News November 26, 2025
రెండు మండలాలుగా విభజన కానున్న ఆదోని

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోని మండలాన్ని విభజించి రెండు మండలాలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మండలంలో మొత్తం 46 గ్రామాల పరిధిలో 2,69,286 మంది జనాభా ఉన్నారు. పెద్దహరివాణం కేంద్రంగా ఏర్పడే మండలంలో 16 గ్రామాలను చేర్చనున్నారు. 43,105 మంది జనాభా ఉంటారు. ఆదోని కేంద్రంగా ఉండే మండలంలో 30 గ్రామాలు ఉంటాయి. 2,26,181 మంది జనాభా ఉంటారు.
News November 26, 2025
రెండు మండలాలుగా విభజన కానున్న ఆదోని

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోని మండలాన్ని విభజించి రెండు మండలాలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మండలంలో మొత్తం 46 గ్రామాల పరిధిలో 2,69,286 మంది జనాభా ఉన్నారు. పెద్దహరివాణం కేంద్రంగా ఏర్పడే మండలంలో 16 గ్రామాలను చేర్చనున్నారు. 43,105 మంది జనాభా ఉంటారు. ఆదోని కేంద్రంగా ఉండే మండలంలో 30 గ్రామాలు ఉంటాయి. 2,26,181 మంది జనాభా ఉంటారు.


