News April 21, 2024

కర్నూలు: నేడు ఆదర్శ పాఠశాలలకు ప్రవేశ పరీక్ష

image

కర్నూలు జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాలకు నేడు పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామూల్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. వెబ్ సైటు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరుకావాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, బ్లూ, బ్లాక్ పెను, పరీక్ష ప్యాడ్ తో ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

Similar News

News September 30, 2024

కర్నూలు: మార్కెట్‌కు ఉల్లి సరకు తీసుకురావద్దు

image

కర్నూలు మార్కెట్‌కు రైతులు ఉల్లి సరకు తీసుకురావద్దని రైతులకు, కమిషన్ దారులకు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి ఆర్.జయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌లో అత్యధికంగా ఉల్లి వచ్చినందున మార్కెట్‌లో ఎక్కడా స్థలం కూడా ఖాళీ లేదని చెప్పారు. లారీలు వచ్చి వెళ్లడానికి కూడా ట్రాఫిక్ సమస్య ఉందని తెలిపారు.

News September 30, 2024

నంద్యాల: చెరువులో శిశువు మృతదేహం కలకలం

image

నంద్యాల పట్టణంలోని చెరువులో నెల వయసున్న శిశువు మృతదేహం సోమవారం కలకలం సృష్టించింది. అటుగా వెళుతున్న కొందరు సమాచారాన్ని పోలీసులకు అందించారు. చెరువు దగ్గరికి వచ్చి శిశువును పరిశీలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. చెరువులో బతికి ఉన్న శిశువును పడేశారా లేదా చనిపోయిన శిశువును పడేశారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

News September 30, 2024

దసరాకు 758 ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా APSRTC కడప జోన్ పరిధిలోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 758 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు అన్నారు.