News August 17, 2024

కర్నూలు: నేడు 24 గంటలు వైద్య సేవలు బంద్

image

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్ కత్తా నగరం ఆర్జే కార్ హాస్పిటల్లో హత్యాచార ఘటనకు నిరసనగా జిల్లాలోని అన్ని హాస్పిటల్స్ 24 గంటల పాటు (శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు) సాధారణ వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కర్నూలు అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామచంద్ర నాయుడు, డాక్టర్ ఎస్వీ రామమోహన్ రెడ్డి తెలిపారు. కేవలం అత్యావసర కేసులు మాత్రమే చూస్తామన్నారు.

Similar News

News October 26, 2025

ఈనెల 27న పబ్లిక్ గ్రీవెన్స్: జిల్లా కలెక్టర్

image

ఈనెల 27న పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. (సోమవారం) ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం జరుగుతోందన్నారు. మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిల్లో కూడా ఇదే కార్యక్రమం ఉంటుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News October 25, 2025

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజకుమారి గణియా శనివారం పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ఈనెల 27, 28, 29 తేదీల్లో నంద్యాల జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు చెప్పారు. వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయొద్దని, మొక్కజొన్న పంట కోతను వాయిదా వేసుకోవాలని, రైతులు పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. పురాతన మట్టి మిద్దెల కింద నివాసం ఉండొద్దని సూచించారు.

News October 25, 2025

పోలీసుల అదుపులో శివశంకర్ స్నేహితుడు

image

కర్నూలు బస్సు ప్రమాదంలో శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ప్రమాదానికి ముందు శివశంకర్‌ బైక్‌‌ ఎక్కారు. వీరిద్దరూ పెట్రోల్ బంకులో ఉన్న <<18098159>>CC వీడియో<<>> బయటకొచ్చింది. బస్సు-బైక్ ఢీకొన్న ఘటనలో శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరూ ఎగిరి పడినట్లు తెలుస్తోంది. ఘటనలో శివశంకర్ మృతిచెందగా ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డారు.