News March 16, 2025
కర్నూలు: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్

కర్నూలు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రైవేట్ పాఠాశాలలకు చెందిన విద్యార్థులు తమ పాఠశాల యూనిఫామ్ వేసుకుని పరీక్షలకు హాజరు కాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఆదివారం తెలిపారు. ఈ ఆదేశాలను అతిక్రమించి విద్యార్థులను యూనిఫామ్తో పరీక్షలకు పంపితే, ఆ పాఠశాలల యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Similar News
News November 25, 2025
కర్నూలు: ‘విద్యార్థుల హృదయాలను గెలిచారు’

కర్నూలు డీఈవో శామ్యూల్ పాల్ మరోసారి తనదైన శైలిలో విద్యార్థుల హృదయాలను గెలిచారు. మంగళవారం క్రిష్ణగిరి మండలంలోని పలు విద్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. క్రిష్ణగిరిలోని ఓ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థికి స్వయంగా గోరుముద్దలు తినిపించారు. అనంతరం కేజీబీవీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఫలితాలలో మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.
News November 25, 2025
కర్నూలు SP స్పందనకు 95 ఫిర్యాదులు

కర్నూలులో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 95 ఫిర్యాదులు స్వీకరించినట్టు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజలను ప్రత్యక్షంగా కలసి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ, పోలీసు అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News November 25, 2025
కర్నూలు SP స్పందనకు 95 ఫిర్యాదులు

కర్నూలులో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 95 ఫిర్యాదులు స్వీకరించినట్టు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజలను ప్రత్యక్షంగా కలసి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ, పోలీసు అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


