News December 15, 2024

కర్నూలు: పుట్టినరోజు నాడు తీవ్ర విషాదం

image

రాజంపేటలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. కోవెలకుంట్లకు చెందిన కిరణ్ రాజంపేట ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. శనివారం కిరణ్‌ పుట్టినరోజు కావడంతో పులివెందులకు చెందిన ఫ్రెండ్ బన్నీ చెన్నైలో చదువుతూ రాజంపేటకు వచ్చారు. కాగా వీరి ఇరువురినీ ఆర్టీసీ బస్సు ఢీకొని పుట్టినరోజు నాడే మృతి చెందగా.. అదే చివరి రోజైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News December 11, 2025

కర్నూలు డీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్

image

కర్నూలు విద్యాశాఖ అధికారిగా గురువారం ఎల్.సుధాకర్ బాధితులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ A.సిరిని మర్యాదపూర్వకంగా కలిశారు. డీఈవో మాట్లాడుతూ.. రానున్న పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కలసికట్టుగా కృషి చేస్తామన్నారు. జిల్లాలో విద్యార్థుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.

News December 11, 2025

ప్రజా సేవల్లో సంతృప్తి పెంచేందుకు చర్యలు: కర్నూలు కలెక్టర్

image

పెన్షన్, రేషన్, ఆసుపత్రి సేవలు, అన్నా క్యాంటీన్లు తదితర ప్రభుత్వ సేవల్లో ప్రజల సంతృప్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి, సీఎస్ విజయానంద్‌కు వివరించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ అధికారులను ఉద్దేశించి అవినీతి లేకుండా, లబ్ధిదారులకు మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని సూచించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News December 11, 2025

ఎస్‌ఐఆర్ పూర్తికి సహకరించండి: కర్నూలు ఆర్వో విశ్వనాథ్

image

కర్నూలు అసెంబ్లీలో ఎస్‌ఐఆర్‌ను బూత్ స్థాయిలో ఖచ్చితంగా పూర్తి చేయాలని ఆర్వో పి.విశ్వనాథ్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ వివరాలు, చిరునామా, ప్రోజనీ సమాచారాన్ని తప్పనిసరిగా బూత్ యాప్‌లో నమోదు చేయాలని, నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కర్నూలులో 2,74,803 ఓటర్లలో ఇప్పటివరకు 37,561 మ్యాపింగ్, 15,821 ప్రోజనీ పూర్తి అయ్యాయన్నారు.