News September 27, 2024
కర్నూలు: పెన్షన్లకు రూ.102.97 కోట్లు
అక్టోబర్ నెలలో కర్నూలు జిల్లాలో పెన్షన్ల పంపిణీకి గాను రూ.102.97 కోట్ల నిధులు విడుదలైనట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ సలీం బాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,41,843 పెన్షన్లకు నగదు మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఎంపీడీవోలు డ్రా చేసుకుని నేరుగా సచివాలయ ఉద్యోగులకు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.
Similar News
News October 10, 2024
ఆదోని: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆదోని మండలం సాదాపురం క్రాస్ ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని అంజి(48) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కొంతకాలంగా పెట్రోల్ బంక్లో జీవనం సాగిస్తున్నాడు. వేకువజామున టీ తాగడానికి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కోమాలోకి వెళ్లాడు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బంధువులు మెరుగైన చికిత్స కోసం కర్నూలు తరలిస్తుండగా మృతి చెందాడు.
News October 10, 2024
రతన్ టాటా మృతి ఎంతో బాధాకరం: మంత్రి టీజీ భరత్
టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతి పట్ల మంత్రి టీజీ భరత్ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణవార్త తనను ఎంతో దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. రతన్ టాటా ఆలోచనా విధానంతో టాటా గ్రూప్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని చెప్పారు. ఆయన ఎన్నో పరిశ్రమలు నెలకొల్పి లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని కొనియాడారు.
News October 10, 2024
నంద్యాల: భోధనంలో పిడుగు
బండిఆత్మకూరు మండలం భోధనం గ్రామంలో గురువారం మధ్యాహ్నం పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం వర్షానికి ముందు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగు పడింది. ఎవరూ లేని చోట ఉన్న వృక్షంపై పిడుగు పడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని గ్రామస్థులు తెలిపారు.