News May 23, 2024

కర్నూలు: మహిళల మృతిలో వీడిన మిస్టరీ

image

నగరవనం చెరువులో మహిళల మృతి కేసులో ఆటోడ్రైవర్ మమబూబ్ బాషాను అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాలు..మహబూబ్‌నగర్(D)కు చెందిన జానకి, అరుణలు వేశ్యవృత్తిలో కొనసాగుతూ కర్నూలు వచ్చేవారు. ఈక్రమంలో బాషాతో పరిచయం ఏర్పడింది. మనస్పర్థలతో జానకి అతడిని కొట్టించింది. ఈనెల19న వారిద్దరు బాషా ఆటోలోనే బట్టలు ఉతకడానికి వెళ్లారు. అవకాశం కోసం చూస్తున్న బాషా జానకిని చెరువులోకి తోశాడు. కాపాడే క్రమంలో అరుణ కూడా మునిగిపోయింది.

Similar News

News October 2, 2024

నంద్యాల: గ్రీన్ కో పవర్ లైన్‌పై సమీక్ష

image

గ్రీన్ కో ఎలక్ట్రికల్ పవర్ లైన్ ట్రాన్స్మిషన్ ఏర్పాటుపై కలెక్టర్ రాజకుమారి మంగళవారం నంద్యాల కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో గ్రీన్ కో ఎలక్ట్రికల్ పవర్ లైన్ ట్రాన్స్మిషన్‌కు సంబంధించి షెడ్యూల్ కులాల హక్కులకు భంగం కలగకుండా డివిజనల్ కమిటీ సూచించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని పేర్కొన్నారు.

News October 2, 2024

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి మెడిసిన్ సీటు

image

బనగానపల్లెలోని మంగళవారం పేటకు చెందిన సలాం, నాయుమున్నిసా దంపతులు కుమారుడు కలీమ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫేస్-2 ఫలితాల్లో మెడిసిన్ సీటు సాధించారు. దీంతో కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతనికి సీటు దక్కింది. కలీమ్ తల్లి SGT ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, తండ్రి స్వర్ణకారుడిగా పని చేస్తున్నారు. కాగా, కలీమ్ GOVT జూనియర్ కళాశాలలో చదివి సీటు సాధించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

News October 1, 2024

సీఎం స‌మ‌క్షంలో హామీ ఇచ్చిన మంత్రి టీజీ భ‌ర‌త్

image

క‌ర్నూలు జిల్లాలో త్వ‌ర‌లోనే ట‌మోటా ప్రాసెసింగ్ యూనిట్ నెల‌కొల్పుతామ‌ని రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. పత్తికొండ మండలం పుచ్చ‌కాయ‌ల‌మ‌డలో సీఎంతో క‌లిసి ప్ర‌జావేదిక కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ట‌మోటా పంట‌ను ఎక్కువ‌గా సాగు చేస్తార‌న్నారు. యూనిట్ నెల‌కొల్పేందుకు ఉన్న వివాదాల‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని సీఎం స‌మ‌క్షంలో చెప్పారు.