News February 15, 2025
కర్నూలు మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు

ఏపీ టూరిజం ఆధ్వర్యంలో యూపీ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఈనెల 17న తిరుపతి, ఒంటిమిట్ట, ఓర్వకల్లు, కర్నూలు, హైదరాబాద్, బాసర, వారణాశి మీదుగా ప్రయాగ్రాజ్ చేరుకుంటుంది. తిరిగి జబల్పూర్, హైదరాబాద్, కర్నూలు, మహానంది మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఈ బస్సు 17న మ.2.15 గంటలకు కర్నూలుకు వస్తుంది. టికెట్ ధర రూ.20వేలు, పిల్లలకు రూ.17, 200లుగా నిర్ణయించారు.
Similar News
News December 4, 2025
TODAY HEADLINES

➻ ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
➻ విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు: సీఎం చంద్రబాబు
➻ త్వరలో 40వేల ఉద్యోగాల భర్తీ: CM రేవంత్
➻ దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించిన సీఎం చంద్రబాబు
➻ డాలరుతో పోలిస్తే 90.13కి చేరిన రూపాయి మారకం విలువ
➻ ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 15 మంది మృతి
➻ రెండో వన్డేలో భారత్పై సౌతాఫ్రికా విజయం
News December 4, 2025
లింగ నిర్ధారణ పరిక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆడపిల్లల సంఖ్యను పెంచుదాం, ఆడ-మగ సమతుల్యాన్ని సాధిద్దాం అన్నారు. పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
News December 4, 2025
HYD: వరంగల్ రూట్లో బ్లాక్ స్పాట్స్ ఇవే!

ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో యాక్సిడెంట్ ఇంజినీర్ల బృందం గుర్తించింది. ముఖ్యంగా CPRI క్రాస్, ఘట్కేసర్ బైపాస్ జంక్షన్ ముందు 500 మీ.వద్ద పలు ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు బీబీనగర్ ఎయిమ్స్ వద్ద ఉన్న రహదారి సైతం బ్లాక్ స్పాట్ ప్రాంతంగా జాతీయ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గుర్తించినట్లుగా తెలిపింది.


