News February 15, 2025

కర్నూలు మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు

image

ఏపీ టూరిజం ఆధ్వర్యంలో యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఈనెల 17న తిరుపతి, ఒంటిమిట్ట, ఓర్వకల్లు, కర్నూలు, హైదరాబాద్, బాసర, వారణాశి మీదుగా ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటుంది. తిరిగి జబల్‌పూర్, హైదరాబాద్, కర్నూలు, మహానంది మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఈ బస్సు 17న మ.2.15 గంటలకు కర్నూలుకు వస్తుంది. టికెట్ ధర రూ.20వేలు, పిల్లలకు రూ.17, 200లుగా నిర్ణయించారు.

Similar News

News March 23, 2025

డబుల్ సెంచరీతో చెలరేగిన రుత్విక్ కళ్యాణ్

image

కర్నూలులో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోటీల్లో కర్నూలుకు చెందిన రుత్విక్ కళ్యాణ్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. నంద్యాలతో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ఆదోనితో జరిగిన మ్యాచ్‌లో 122 బంతుల్లో 154 పరుగులు చేసి తన సత్తా చాటాడు. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయికి రుత్విక్ కళ్యాణ్ చేరుకోవాలని పలువురు ఆకాంక్షించారు.

News March 23, 2025

నంద్యాలలో వార్డెన్‌పై పోక్సో కేసు

image

నంద్యాలలోని ఓ స్కూల్ హాస్టల్ వార్డెన్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరిట మాయమాటలతో మభ్యపెట్టి.. బాలికను తిరుపతికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 23, 2025

కొణిదెల గ్రామానికి రూ.50 లక్షలు: పవన్ కళ్యాణ్

image

నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామాభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు ప్రకటించారు. పూడిచర్లలో ఫారమ్ పాండ్స్‌కు శంకుస్థాపన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. తన సొంత ట్రస్టు నుంచి నిధులను కేటాయించారు. ఎమ్మెల్యేతో మాట్లాడి కొణిదెల గ్రామానికి ఏం అవసరమో అవన్నీ చేస్తానని, ప్రభుత్వ పథకాలన్నీ ఈ ఊరి ప్రజలకు అందేలా చూస్తానని పవన్ హామీ ఇచ్చారు. కాగా, పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కొణిదెల అని తెలిసిందే.

error: Content is protected !!