News November 13, 2024

కర్నూలు మీదుగా శబరిమలకు స్పెషల్ రైలు

image

అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కర్నూలు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 14, 21, 28 తేదీలలో సాయంత్రం 5:50 నిమిషాలకు కర్నూలు మీదుగా కొట్టాయం వెళుతుంది. తిరిగి ఈ నెల 15, 22, 29 తేదీలలో రాత్రి 8:30 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:00 గంటలకు కర్నూలు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. 

Similar News

News March 10, 2026

కర్నూలు: రూ.14,740 కోట్ల రుణ ప్రణాళిక విడుదల

image

KNL కలెక్టరేట్‌లో నాబార్డు రూపొందించిన 2026-27 ఆర్థిక సంవత్సరపు పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని జేసి నూరుల్ ఖమర్ మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి బ్యాంకులు వెన్నుదన్నుగా నిలవాలన్నరు. మొత్తం రుణ అంచనా రూ.14,740 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.9,283 కోట్లు, విద్యా రుణాలు రూ.203 కోట్లు, MSME 3,653 కోట్లు, గృహ రుణాలు రూ.287 కోట్లుగా నాబార్డు అంచనా వేసింది.

News March 10, 2026

కర్నూలు నగరపాలక సంస్థకు స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ సిరి

image

కర్నూలు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ ఏ.సిరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు కమిషనర్ విశ్వనాథ్‌ను నందికొట్కూరుకు, కర్నూలు ఆర్డీవోను గూడూరుకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. ఆదోనికి జాయింట్ కలెక్టర్, ఎమ్మిగనూరుకు స్థానిక ఆర్డీవోను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News March 10, 2026

ఇంటర్ పరీక్షలకు 526 మంది విద్యార్థులు గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 526 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 20,731 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 20,205 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన పేర్కొన్నారు.