News June 17, 2024
కర్నూలు: ముంతాజ్ బేగంకు జాతీయ యోగా పురస్కారం

కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ యోగా గురువు డాక్టర్ ఎస్.ముంతాజ్ బేగంకు జాతీయ యోగా టీచర్ అవార్డుతో పాటు యోగారత్న అవార్డును హరియాణాకు చెందిన మానవియ్య నిర్మాణ్ మంచ్ ఇండియా ప్రకటించింది. 15ఏళ్లుగా నిర్విరామంగా యోగాతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు గాను ఈ అవార్డు అందజేయనున్నారు. జూన్ 21న 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఈ అవార్డును ముంతాజ్ బేగం హరియణాలో అందుకోనున్నారు.
Similar News
News November 22, 2025
కలెక్టర్ సిరి హెచ్చరిక

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఏ.సిరి నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదులు అందితే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.
News November 22, 2025
కె.నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ వార్షిక తనిఖీ

కె.నాగలాపురం పోలీసు స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, శిక్షలు విధించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి, రికవరీలు చేయాలని ఆదేశించారు.
News November 22, 2025
కె.నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ వార్షిక తనిఖీ

కె.నాగలాపురం పోలీసు స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, శిక్షలు విధించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి, రికవరీలు చేయాలని ఆదేశించారు.


