News March 24, 2025

కర్నూలు మేయర్‌ పీఠంపై టీడీపీ కన్ను!

image

కర్నూలు మేయర్‌ బీవై రామయ్యకు అవిశ్వాస గండం తప్పదా? ఈ అంశం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరో ఏడాది పదవీ కాలం ఉండగా TDP అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. నగర కార్పొరేషన్‌‌లో 52మంది కార్పొరేటర్లు ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ బలం 22కు చేరింది. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 28మంది అవసరం. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

Similar News

News April 20, 2025

కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

image

మంగళగిరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మున్నా ఫరూక్ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిరివెళ్ల సీఐ దస్తగిరి బాబు, ఎస్సై చిన్నపీరయ్య తెలిపారు. నంద్యాలకు చెందిన షేక్ షబ్బీర్ బాషా ప్రియురాలిపై కానిస్టేబుల్ ఫరూక్ అసభ్యంగా ప్రవర్తించాడన్న కోపంతో హత్య చేశారని తెలిపారు. మృతదేహాన్ని గిద్దలూరు అటవీ ప్రాంతంలో పడేశారని వివరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

News April 20, 2025

ఆదోని మెడికల్ కాలేజీపై ఆరోగ్యశాఖ మంత్రి స్పందన

image

కర్నూలు జీజీహెచ్‌లో అవసరమైన ఐపీ బ్లాక్ నిర్మిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్‌ను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆదోని మెడికల్ కాలేజీని అన్ని వసతులతో వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

News April 19, 2025

ఆదోని మెడికల్ కాలేజీపై ఆరోగ్యశాఖ మంత్రి స్పందన

image

కర్నూలు జీజీహెచ్‌లో అవసరమైన ఐపీ బ్లాక్ నిర్మిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న క్రిటికల్ కేర్ బ్లాక్‌ను త్వరలోనే పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆదోని మెడికల్ కాలేజీని అన్ని వసతులతో వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

error: Content is protected !!