News July 21, 2024

కర్నూలు: రైతు బలవన్మరణం

image

ఎమ్మిగనూరు మండలం కే.తిమ్మాపురానికి చెందిన రైతు రంగన్న(39) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం రాత్రి తన సొంత పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గ్రామస్థులు గమనించి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. రంగన్న 2 ఎకరాలు సొంత భూమితో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు.

Similar News

News October 8, 2024

స్వర్ణాంధ్ర@2047 డాక్యుమెంట్ రూపకల్పన: మంత్రి భరత్

image

ఐదేళ్ల అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 డాక్యుమెంట్ రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర @2047 జిల్లా దార్శనిక ప్రణాళిక (2024-29) రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ గ్రోత్ ఇంజిన్ అని, దీని వల్ల జిల్లాలో గణనీయమైన అభివృద్ధి సాధించనున్నామని తెలిపారు. దాదాపుగా రూ.2,800 కోట్లతో ఓర్వకల్లు నోడ్ అభివృద్ధి కానుందని తెలిపారు.

News October 7, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 519 దరఖాస్తులు!

image

ఉ.కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు నంద్యాల జిల్లాలో 105 మద్యం దుకాణాలకు గానూ 217, కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు గానూ 302 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఇక మూడు రోజులే గడువుంది. అయితే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.

News October 7, 2024

కర్నూలు: కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి భారీ కుంభకోణం?

image

కర్నూలు కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి చేతివాటం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కాగా ఆయన ప్రస్తుతం వేరే ప్రాంతానికి బదిలీ అవ్వగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఆయన ఆలయం పేరిట సొంత ఖాతా తెరచి రూ.1.30 కోట్లు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. బినామీలు, సిబ్బంది పేరిట డబ్బులు విత్ డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.