News July 26, 2024
కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం

కర్నూలు-కడప జాతీయ రహదారిలోని శిరివెళ్ల మెట్ట వద్ద శుక్రవారం కూల్ డ్రింక్స్ లోడుతో వెళుతున్న ఆటోకు రోడ్డు ప్రమాదం జరిగింది. కోవెలకుంట్ల నుంచి శిరివెళ్ల వైపు వెళుతున్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై శిరివెళ్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 28, 2025
ఆదోని మండల విభజన గెజిట్ విడుదల

ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఆదోని, పెద్దహరివాణం పేర్లతో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆదోని హెడ్క్వార్టర్గా 29 గ్రామాలు, పెద్దహరివాణం హెడ్క్వార్టర్గా 17 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ మండలాల పునర్విభజన చేపట్టినట్లు వివరించారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల లోపు తెలపాలన్నారు.
News November 28, 2025
ఓటర్ల మ్యాపింగ్లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.
News November 28, 2025
ఓటర్ల మ్యాపింగ్లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.


