News March 19, 2025
కర్నూలు: లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..!

ఆస్పరి SI వెంకట నరసింహులు సస్పెన్షన్కు గురయ్యారు. చిత్తూరు జిల్లా సోమల పీఎస్లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ నుంచి లంచం తీసుకున్న ఘటనలో సస్పెండ్ చేశారు. 2023లో ఓ మహిళ అదృశ్యమవ్వడంతో భర్త ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆమె స్టేషన్కు చేరుకుని తన భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. అందుకు ఎస్ఐ రూ.లక్ష డిమాండ్ చేసి, మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టించాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.
Similar News
News November 21, 2025
కాట్రేనికోన: కొబ్బరి చెట్టు పైనుంచి జారిపడి కార్మికుడి మృతి

అంబేడ్కర్ కోనసీమ జిల్లా దొంతికుర్రులో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కొబ్బరి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి కర్రీ అప్పలరాజు (36) అనే వలస కార్మికుడు మృతి చెందాడు. మృతుడు విశాఖ జిల్లా గోపాలపట్నం వాసిగా గుర్తించారు. కాట్రేనికోన మండలంలో తోటి కూలీలతో కలిసి దింపులు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉపాధి కోసం వచ్చిన కార్మికుడు మృతి చెందడంతో తోటి కూలీల్లో విషాదం అలముకుంది.
News November 21, 2025
ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేశనపల్లిలో కొబ్బరిచెట్లను ఆయన పరిశీలించనున్నారు. దీంతో పాటు 15గ్రామాల రైతులను పరామర్శించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమలోని కొబ్బరి రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే.
News November 21, 2025
మల్దకల్: ఈనెల 25 నుంచి తిమ్మప్ప బ్రహ్మోత్సవాలు

మల్దకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రంలో కొలువైన తిమ్మప్ప స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 25 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 2న స్వామి కళ్యాణం, 3న తెప్పోత్సవం, 4న రాత్రి 11:00 గంటలకు రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. నడిగడ్డ తిరుపతిగా పేరుగాంచిన తిమ్మప్ప స్వామి ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.


