News March 19, 2025

కర్నూలు: లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..!

image

ఆస్పరి SI వెంకట నరసింహులు సస్పెన్షన్‌కు గురయ్యారు. చిత్తూరు జిల్లా సోమల పీఎస్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ నుంచి లంచం తీసుకున్న ఘటనలో సస్పెండ్ చేశారు. 2023లో ఓ మహిళ అదృశ్యమవ్వడంతో భర్త ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆమె స్టేషన్‌కు చేరుకుని తన భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. అందుకు ఎస్ఐ రూ.లక్ష డిమాండ్ చేసి, మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టించాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.

Similar News

News December 2, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జనగామలో అరుదైన కపాల శాస్త్ర చికిత్స
> శ్రీపతిపల్లి సర్పంచ్ బరిలో సొంత అన్నదమ్ములు
> నర్మెట్ట: వైద్య వృత్తిని వదిలి ప్రజాసేవలోకి.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్
> తీగల తండా సర్పంచ్ గా సాంబరాజు యాదవ్ ఏకగ్రీవం
> నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగాలి ఎన్నికల అబ్జర్వర్
> ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలి: అదనపు కలెక్టర్
> ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జనగామ జిల్లా కలెక్టర్

News December 2, 2025

పాలమూరు: ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలి

image

సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఓటర్లు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తమ పోలీస్ అధికారులకు సహకరించాలని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తమ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 2, 2025

తిరుమల: టికెట్ల లింకులు ఓపెన్ కాక అవస్థలు

image

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు లింక్ ద్వారా టికెట్లు పొందుతుంటారు. మంగళవారం దర్శనానికి సంబంధించి సోమవారం భక్తులకు మెసేజ్ ద్వారా లింక్ వచ్చింది. అయితే అది ఓపెన్ కాకపోవడంతో భక్తులు ఆందోళన చెందారు. దీంతో ఎంబీసీ వద్ద నేరుగా వెళ్లి టికెట్లు పొందుతున్నారు.