News August 28, 2024
కర్నూలు: వచ్చే నెల 2న కౌన్సెలింగ్

కర్నూలు వైద్య కళాశాలలోని ఆడిటోరియంలో పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు సెప్టెంబరు 2న కౌన్సెలింగ్ ఉంటుందని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ హరిచరణ్ మంగళవారం తెలిపారు. అభ్యర్థులు తమ అర్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు. బైపీసీ వారికి మొదటి ప్రాధాన్యమిస్తామని పేర్కొ న్నారు. మార్కులు, రోస్టర్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు.
Similar News
News November 24, 2025
సైబర్ మోసాలపై అప్రమత్తం కావాలి: కర్నూలు ఎస్పీ

ATM డిపాజిట్ మెషిన్లు (CDM), PhonePe/UPIను ఉపయోగించి మోసగాళ్లు అక్రమ లావాదేవీలు జరిపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ‘తెలియని వ్యక్తుల కోసం ATM CDMలో డబ్బు జమ చేయండి, PhonePe/UPI ద్వారా పంపండి, కమిషన్ ఇస్తాం’ అంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లు చెప్పారు. ఇవి మనీ లాండరింగ్ & సైబర్ నేరాల కిందికి వస్తాయన్నారు. వాటిలో పాల్గొనేవారు కూడా నేరస్థులే అన్నారు.
News November 24, 2025
సైబర్ మోసాలపై అప్రమత్తం కావాలి: కర్నూలు ఎస్పీ

ATM డిపాజిట్ మెషిన్లు (CDM), PhonePe/UPIను ఉపయోగించి మోసగాళ్లు అక్రమ లావాదేవీలు జరిపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ‘తెలియని వ్యక్తుల కోసం ATM CDMలో డబ్బు జమ చేయండి, PhonePe/UPI ద్వారా పంపండి, కమిషన్ ఇస్తాం’ అంటూ ప్రజలను మోసం చేస్తున్నట్లు చెప్పారు. ఇవి మనీ లాండరింగ్ & సైబర్ నేరాల కిందికి వస్తాయన్నారు. వాటిలో పాల్గొనేవారు కూడా నేరస్థులే అన్నారు.
News November 23, 2025
కూటమి పార్టీలకు సమాన గుర్తింపు: ఎంపీ

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని కర్నూలు ఎంపీ నాగరాజు పిలుపునిచ్చారు. పంచలింగాలలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనను ముగించేందుకు పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి టీడీపీ-జనసేన-బీజేపీలను కూటమిగా ఏకం చేశారని అన్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీల కార్యకర్తలకు సమాన గుర్తింపు ఉంటుందన్నారు.


