News March 5, 2025
కర్నూలు: వలస కూలీల కొడుకు SIగా ఎంపిక

నందవరం మండలం మిట్టసాంపురానికి చెందిన శ్యామరావు, సువర్ణమ్మ దంపతుల రెండో కుమారుడు మారెప్ప తన తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యారు. అనంతపురంలో ట్రైనింగ్ను పూర్తి చేసుకున్న ఆయనకు చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు వలస కూలీలు కాగా.. తమ కష్టానికి తగిన ప్రతిఫలం నేటికి దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్థులు మారెప్పను అభినందించారు.
Similar News
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<
News November 18, 2025
తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 18, 2025
NTR వీరాభిమాని ఆగయ్యకు నేతల నివాళులు

TDP సీనియర్ నేత, NTR వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో PDPL MLA చింతకుంట విజయరమణా రావు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్లో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. TDP ఆవిర్భావం నుంచి పనిచేసిన నేతగా ఆగయ్య పార్టీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారని, ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఉన్నారని నేతలు అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


