News March 5, 2025

కర్నూలు: వలస కూలీల కొడుకు SIగా ఎంపిక

image

నందవరం మండలం మిట్టసాంపురానికి చెందిన శ్యామరావు, సువర్ణమ్మ దంపతుల రెండో కుమారుడు మారెప్ప తన తొలి ప్రయత్నంలోనే సివిల్ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అనంతపురంలో ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్న ఆయనకు చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు వలస కూలీలు కాగా.. తమ కష్టానికి తగిన ప్రతిఫలం నేటికి దక్కిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్థులు మారెప్పను అభినందించారు.

Similar News

News December 22, 2025

ధనుర్మాసం: ఏడోరోజు కీర్తన

image

‘ఓ పిల్లా! పక్షుల కిలకిలారావాలు వినబడటం లేదా? గోపికలు చేతి గాజుల సవ్వడితో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులు నీ చెవిన పడలేదా? మన కష్టాలను తీర్చడానికి కృష్ణుడు కేశి వంటి రాక్షసులను సంహరించాడు. మేమంతా ఆ పరమాత్మ గుణగానం చేస్తూ నీ ఇంటి ముందు ఉన్నాము. వింటున్నావు కానీ ఇంకా నిద్ర వదలడం లేదు. ఇకనైనా మేల్కొని మాతో కలిసి వ్రతానికి సిద్ధం కావమ్మా!’ అంటూ ఆండాళ్ గోపికను వేడుకుంటోంది. <<-se>>#DHANURMASAM<<>>

News December 22, 2025

ప్రపంచ రికార్డు సృష్టించారు

image

న్యూజిలాండ్ ఓపెనర్లు కాన్వే, లాథమ్ ప్రపంచ రికార్డు సృష్టించారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో శతకాలు బాదారు. దీంతో ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు చేసిన తొలి ఓపెనర్లుగా నిలిచారు. తొలి ఇన్నింగ్సులో కాన్వే(227), లాథమ్(137) చేశారు. రెండో ఇన్నింగ్సులో లాథమ్(101), కాన్వే(100) శతకాలు బాదారు.

News December 22, 2025

చిన్న శంకరంపేట: తాత హయాంలో నిర్మాణం.. మనుమడి హయాంలో హంగులు

image

చిన్నశంకరంపేట జీపీ సర్వంగ సుందరంగా ముస్తాబయింది. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రశేఖర్ తాత కంజర్ల శంకరప్ప రెండవసారి సర్పంచ్ గా పదవీలో కొనసాగుతున్నప్పుడు 01 నవంబర్ 1977 నాటికి గ్రామపంచాయతీ నిర్మాణం చేపట్టారు. ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి కోదాటి రాజమల్లు ప్రారంభోత్సవం చేశారు. తాత నిర్మాణం చేపట్టిన జీపీలో మనుమడు పదవి చేపట్టడం కొసమెరుపు.