News April 2, 2025

క‌ర్నూలు- విజ‌య‌వాడ విమాన స‌ర్వీసులపై చ‌ర్చించిన మంత్రి టీజీ

image

క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు విమాన స‌ర్వీసులు ప్రారంభించాల‌ని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరిన‌ట్లు ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసి క‌ర్నూలు – విజ‌య‌వాడ విమాన సౌక‌ర్యంపై చ‌ర్చించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పార‌ని టి.జి భరత్ పేర్కొన్నారు.

Similar News

News November 27, 2025

ఎలక్టర్ల మ్యాపింగ్‌లో పురోగతి ఉండాలి: కర్నూల్ కలెక్టర్

image

ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియలో మరింత పురోగతి తీసుకురావాలని కర్నూల్ జిల్లా కలెక్టర్ సిరినీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ సూచించారు. గురువారం విజయవాడలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫార్ములను త్వరితగతిన క్లియర్ చేయాలని, బీఎల్ఓ, ఎపిక్ కార్డు పంపిణీ, మ్యాపింగ్, శిక్షణ విషయాలను వేగవంతంచేయాలని సూచించారు.

News November 27, 2025

విద్యార్థులతో కర్నూలు కలెక్టర్ మాటామంతి

image

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి బుధవారం కార్యాలయ ఛాంబర్లో మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం రక్షణపై పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల అవగాహనను పరిశీలించారు. విద్యార్థుల పాఠశాల సమస్యలు, పాఠ్యాంశాల బోధన, 10వ తరగతి పరీక్షలకు సిద్ధత వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు. ధైర్యంగా సమాధానాలిచ్చిన విద్యార్థులను అభినందించారు.

News November 26, 2025

కలెక్టర్‌ను మైమరిపించిన ఓర్వకల్లు మహిళా రైతు

image

ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు రాజకుమారిని కలెక్టర్ డా. ఏ. సిరి ప్రశంసించారు. బుధవారం రాజకుమారి పొలంను కలెక్టర్ పరిశీలించి పంటల సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 70 సెంట్ల భూమిలో అంతర పంటల పద్ధతిలో కందులు, అలసందలు, సజ్జలు, మినుములు, గోరు చిక్కుడు, ఆకుకూరలు సాగు చేసి రూ.5 వేల పెట్టుబడితో రూ.60 వేల లాభం సాధించినట్లు రాజకుమారి వివరించారు.