News April 3, 2025
కర్నూలు-విజయవాడ విమాన సర్వీసులపై చర్చ

కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారని భరత్ తెలిపారు.
Similar News
News April 11, 2025
కర్నూలు విద్యాశాఖ ఏడీపై సస్పెన్షన్ వేటు

కర్నూలు విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు పడింది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తన్నాడని ఇటీవల ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయి. విచారణ చేపట్టిన కడప ఆర్జేడీ నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. దీంతో తాజాగా ఆయనను సస్పెండ్ చేస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
News April 11, 2025
రేపే రిజల్ట్.. కర్నూలు జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ!

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. కర్నూలు జిల్లాలో 45,325 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 69 కేంద్రాల్లో పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
ఆదోని: రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 లో భాగంగా ఆదోని నియోజకవర్గంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫారం 6,7,8 నూతన ఓటర్ నమోదు, చిరునామా, మొదలగు అంశాలపై ఎన్నికల అధికారి/ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులతో చర్చించారు. ఎన్నికల ఉప తహశీల్దారు గాయత్రి, తదితరులు ఉన్నారు.