News March 19, 2024

కర్నూలు: వైసీపీ MLA అభ్యర్థుల్లో వీరే చిన్నోళ్లు

image

కర్నూలు జిల్లాలో 14మంది ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులను వైసీపీ అదిష్ఠానం ప్రకటించింది. వీరిలో 1988లో జన్మించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డి అందరికంటే వయస్సులో చిన్నవారు. ఆయన తర్వాత స్థానంలో 1988లో జన్మించిన నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నారు. అందరి కంటే ఎక్కువ వయస్సు కల్గిన అభ్యర్థిగా 1954లో జన్మించిన నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.

Similar News

News December 2, 2025

కర్నూలు రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలివే.!

image

కర్నూలు హైవే-44 సంతోశ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం <<18451272>>ఘోర రోడ్డు ప్రమాదం<<>> చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా అక్కడ మృతి చెందినవారి వివరాలను పోలీసులు తెలిపారు. మృతులు గూడూరుకి చెందిన మాలకమతల చంద్రమోహన్(32), మాల సుమన్(30)గా పోలీసులు గుర్తించారు. కాగా గాయపడిన మాల నవీన్ (33)ది ఎమ్మిగనూరు. అయితే వీరు కూలీ పనులతో జీవనం సాగించేవారని కుటుంబసభ్యులు తెలిపారు.

News December 2, 2025

‘రైతన్న.. మీకోసం’లో కర్నూలుకు రాష్ట్రంలో మొదటి స్థానం

image

వారం రోజులు నిర్వహించిన ‘రైతన్న.. మీకోసం’లో రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి రైతులకు పంచసూత్రాలు వివరించి, ఫొటోలు పోర్టల్‌లో అప్లోడ్ చేయడం అత్యధిక శాతం నమోదు కావడంతో ఈ విజయాన్ని సాధించామని చెప్పారు. ఈనెల 2, 3వ తేదీల్లో రైతు సేవా కేంద్రాల్లో నిర్వహించే వర్క్‌షాపులను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News December 2, 2025

విచారణ జరిపి న్యాయం చేస్తాం: ఎస్పీ

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల విజ్ఞప్తులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 102 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు.