News June 12, 2024
కర్నూలు: సీనియర్లకు దక్కని మంత్రి పదవి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రి పదవి ఆశించిన సీనియర్లకు నిరాశ ఎదురైంది. జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కాయి. సీనియర్ నాయకులు కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, బీవీ జయనాగేశ్వర రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి కేబినెట్లో చోటు దక్కుతుందని భావించారు. అయితే సీనియర్ నేతలు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, యువ నేత టీజీ భరత్కు మాత్రమే దక్కింది. ఇటు కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన పార్థసారథికి కూడా దక్కలేదు.
Similar News
News November 10, 2025
కర్నూలు జిల్లాలో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు

ఈ నెల 11న కర్నూలు జిల్లాలో పలు ప్రాజెక్టులకు వర్చువల్గా సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. దీనిపై సంబంధిత అధికారులతో ఆమె ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏపీఐఐసీ, విమానాశ్రయం, పర్యటక శాఖలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 10, 2025
కర్నూలు: డయల్ యువర్ APSPDCL సీఎండీ

ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ APSPDCL సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఆదివారం వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా కర్నూల్, నంద్యాల జిల్లాలలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చన్నారు. 8977716661 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
News November 10, 2025
కర్నూలు జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు: ఎస్పీ

కర్నూలు జిల్లాలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం జిల్లాలో నేర నియంత్రణకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గస్తీలు, తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.


