News November 29, 2024

కర్నూలు: ‘సెమిస్టర్ పరీక్షలను పక్కగా నిర్వహించాలి’

image

పరీక్షలను సరిగ్గా నిర్వహించాలని ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ ఎన్టీకే నాయక్ అన్నారు. శుక్రవారం రాయలసీమ వర్సిటీ పరిధిలో డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో 61 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. 6,531 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 5,848 మంది హాజరయ్యారు. 683 గైర్హాజరయ్యారు.

Similar News

News December 9, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్–వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. భారీ వాహనాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్‌డివిజన్లలో నేషనల్ హైవేలు 40, 44పై లారీలు, ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, వ్యాన్లు, లగేజీ వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించారు.

News December 9, 2025

ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం తగ్గించాలి: కర్నూలు కలెక్టర్

image

జిల్లాలో పీజీఆర్ఎస్ పనితీరు విశ్లేషణలో భాగంగా సీఎం కార్యాలయం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం గత నెలలో ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం బాగా తగ్గిందని, డిసెంబర్‌లో ఇంకా ఎక్కువగా తగ్గించాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఫిర్యాదులను ఆడిట్ చేయడంలో 20 శాతం పెండింగ్ ఉందని వెంటనే ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

News December 9, 2025

ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం తగ్గించాలి: కర్నూలు కలెక్టర్

image

జిల్లాలో పీజీఆర్ఎస్ పనితీరు విశ్లేషణలో భాగంగా సీఎం కార్యాలయం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం గత నెలలో ఇంప్రాపర్ రెడ్రెస్సల్ శాతం బాగా తగ్గిందని, డిసెంబర్‌లో ఇంకా ఎక్కువగా తగ్గించాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఫిర్యాదులను ఆడిట్ చేయడంలో 20 శాతం పెండింగ్ ఉందని వెంటనే ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.