News March 12, 2026
కర్నూలు: సెలవుల్లేని సేవ.. రోగులకు అండగా సిరాజ్ ఉల్

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ సిరాజ్ ఉల్ 15 ఏళ్లుగా నిరంతరం రోగులకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సెలవులు, ఆదివారాల్లోనూ విధులు నిర్వర్తిస్తూ ఆసుపత్రికి వచ్చే సుమారు 700 మంది రోగులకు మందులు అందిస్తున్నారు. ఆసుపత్రిలో మహిళలు, పురుషులకు ఒకే కౌంటర్ ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రమబద్ధంగా మందులు పంపిణీ చేస్తూ సేవాభావాన్ని చాటుతూ.. అందరి మన్ననలు పొందుతున్నారు.
Similar News
News April 14, 2026
బెట్టింగ్లకు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని సీఐ

ఆదోనిలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న పలువురు అనుమానితులకు వన్టౌన్ సీఐ రాజశేఖర్ సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. బెట్టింగ్ అక్రమాలకు పాల్పడితే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి, జిల్లా బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయడంతో పాటు బ్యాంకు ఖాతాలను సీజ్ చేస్తామన్నారు. బెట్టింగ్ను ప్రోత్సహించే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.
News April 13, 2026
కర్నూలు: పోలీస్ PGRSకి 1122 అర్జీలు

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో బాధితుల నుంచి SP విక్రాంత్ పాటిల్ స్వయంగా వినతులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 112 ఫిర్యాదులు అందాయి. ఆర్థిక మోసాలు, బెదిరింపులు, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను చట్టపరంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తదితరులు పాల్గొన్నారు.
News April 13, 2026
అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలి: కలెక్టర్

క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారులు ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు తమ దృష్టికి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగానే సమస్యలకు పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేయాలని ఆమె ఆదేశించారు.


