News April 9, 2025
కర్నూలు: 1,78,466 పేపర్ల మూల్యాంకనం

10వ తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం మంగళవారం నాటికి 1,78,466 పేపర్ల మూల్యాంకనం జరిగింది. ఆరవ రోజు మూల్యాంకనం ముగిసే సమయానికి 93%గా నమోదయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. 114 మంది చీఫ్ ఎగ్జామినర్లు,682 మంది అసిస్టెంట్ చీఫ్ ఎగ్జామినర్లు, 215 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఓపెన్ ఇంటర్కు సంబంధించి మూల్యంకనం పూర్తయినట్లు వెల్లడించారు.
Similar News
News December 25, 2025
ఆదోని మండల విభజనపై స్థానికుల నిరసన

ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా 17 గ్రామాలతో ‘పెద్ద హరివాణం’ మండలాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త మండల కేంద్రం కర్ణాటక సరిహద్దులో ఉండటం వల్ల చాలా గ్రామాలకు 40 కిలోమీటర్ల దూరం అవుతుందని ఆందోళన, నిరసనలు చేపట్టారు. ఈ అభ్యంతరాలపై రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది. ఈ నెల 28న జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
News December 24, 2025
కర్నూలు SP కీలక నిర్ణయం

కర్నూలు జిల్లాలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారి లొకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఉద్యోగాల మోసాలు, ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల కేసులను ఛేదించి రికవరీలను పెంచాలని, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.
News December 24, 2025
నేర నివారణే లక్ష్యంగా పనిచేయాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్

కర్నూలు జిల్లాలో నేర నివారణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రౌడీషీటర్లపై నిఘా ఉంచి వారి లొకేషన్లను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. ఉద్యోగాల మోసాలు, ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల కేసులను ఛేదించి రికవరీలను పెంచాలని, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.


